సోదరిసోదరీమణులారా...నేడే చూడండి...మీ అభిమాన ఆర్ట్ గ్యాలరీలో...బాపు బొమ్మలకొలువు...బాపు బొమ్మలకొలువు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ కలిసి ప్రారంభించిన అపురూప చిత్ర ప్రదర్శన "బాపు బొమ్మల కొలువు''. ప్రతిరోజు రెండు ఆటలు. ఉదయం 11గంటలకు మార్నింగ్షో, సాయంత్రం 5 గంటలకు ఫస్ట్షో. (సినిమా రిక్షాలో వినిపించే మైక్ అనౌన్స్మెంట్లా చదువుకో ప్రార్థన)దర్శకుడు వంశీ కథలోని దేవాంగులమణి అద్దం ముందు కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుతూ కొప్పు ముడేసుకుంటుంది. వెనక పసలపూడి ఊరంతా కనబడుతోంది. ఆ బొమ్మ ముందు నిల్చొని 'వంశీ' విభ్రమంగా ఫొటో తీయించుకుంటున్నారు. ఈ బొమ్మల కింద రేట్లు వేయలేదా అని అక్కినేని అంటున్నారు. సీమ సమరసింహారెడ్డి బొమ్మ ఏదైనా ఉందేమోనని బాలకృష్ణ వెతుకుతున్నాడు. మద్రాసు నుంచి కార్టూనిస్టు సురేంద్ర, నర్సింలు రెక్కలు కట్టుకుని వచ్చారు.
నాగార్జునసాగర్ నుంచి సుదర్శన్సారు మూటాముల్లె సర్దుకొని రాందేవ్ బాబా మీటింగ్కి వచ్చినట్టు వచ్చారు. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తే బొమ్మల కొలువు టైమ్కి అందుకోలేనని ఇంటికి వెళ్లకుండా రాత్రంతా జాగారం చేసి మరీ నేను హాజరయ్యాను. అందరూ వచ్చి ఇంత ఆబగా చూస్తున్నది ఏంటయ్యా అంటే బాపు బొమ్మలు. 1960, 70 ల్లో తెలుగు పత్రికల్లో నిండిపోయిన బాపు బొమ్మల ఒరిజినల్స్ ప్రదర్శన జరుగుతోంది మరి.
ఎగ్జిబిషన్కి వచ్చినవాళ్లు ఆ బొమ్మల్ని చూసుకుంటూ ఎవరి జ్ఞాపకాల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. ఈ బొమ్మ కథ నేను 70 ల్లో ఇంటర్లో ఉండగా చదివానని ఒకాయన, ఈ బొమ్మ నేను ఆంధ్రజ్యోతిలో 80 ల్లో చూశానని ఒకావిడ. ఆ కార్టున్ చూసి అప్పట్లో తెగ నవ్వారని ఇప్పుడూ నవ్వుతున్నానని ఓ ముసలాయనా..పిల్లలకు బొమ్మల్ని అపురూపంగా చూపిస్తున్న తల్లులు, తండ్రులు. ఆటోగ్రాఫ్లు ఇస్తూ బాపు, ఆయన చుట్టూ ఆర్టిస్టుల మూక, క్లిక్మని ఫొటోలు, జూమ్మని వీడియోలు...సందడిసందడిగా ఉంది అక్కడి వాతావరణం.
తెలుగునాట ప్రసిద్ధ చిత్రకారులైన బాపుగారు అరశతాబ్దంగా వివిధ కథలకి, వేర్వేరు సందర్భాలకి వేసిన అపురూప చిత్రాలు చోటు చేసుకున్నాయి ఈ ప్రదర్శనలో. ఎన్నో కలర్ డ్రాయింగులు, బ్లాక్ అండ్ వైట్ ఇండియన్ ఇంక్ గీతలు సాధారణ డ్రాయింగ్ షీట్లమీద, ఖరీదైన టెక్చర్ పేపర్మీదా వేసినవి కనువిందు చేస్తున్నాయి. ఎక్కడ వెతికినా గీత తప్పురావడం, తుడవడానికి వైట్ కలర్ పూయడం కనిపించలేదు. బొమ్మల్లో అనాటమి అదిరిపోయి 'ఇలా ఎలా వేశాడ్రా బాపూ' అనుకోవడం ఆర్టిస్టుల వంతైంది. ముఖ్యంగా వంశీ కథలకి బాపు వేసిన బొమ్మలు అందరికీ ఆనందాన్ని పంచాయి.
ఇలాంటి దాదాపు వెయ్యి బొమ్మలదాకా ఈ బొమ్మలకొలువులో ఉంచారు ముఖీ మీడియావారు. కొన్ని ఒరిజినల్స్, కొన్ని ప్రింట్లు. మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ శని, ఆది, సోమవారాల్లో బాపు బొమ్మల ఎగ్జిబిషన్ జరుగుతోంది. తనికెళ్లభరణి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఆర్టిస్టులు మోహన్, ఏలెలక్ష్మణ్, పినిశెట్టి, అక్బర్లాంటి వాళ్లు వచ్చిపోతున్నారు. మీరందరూ కూడా వచ్చిపోవచ్చు. బొమ్మలు చూడొచ్చు. బుద్ధయితే ప్రింటన్లను కొనుక్కోవచ్చు. లేదంటే బాపు బొమ్మల సౌందర్యాన్ని చూసి ముక్కున వేలేసుకొని బయటికి ఫ్రీగా రావచ్చు. కమ్ మాన్. కమ్ విమెన్. కమ్ విత్ చ్రిల్డన్. * శేఖర్, కార్టూనిస్ట్


బాపు చిత్రకారులు కావడంతో ప్రతి సన్నివేశంలో చూపించదలచుకున్న ప్రతి చిన్న అంశాన్నీ కూడా ఆయన ఒక బొమ్మ వేసుకుంటారు. ఆయన బొమ్మల సృష్టికి మూలం అంతా స్క్రీన్ప్లేలో చాలా పటిష్ఠంగా ముళ్లపూడి వెంకటరమణ అందించారు. వీరి సినిమాల్లో నేపథ్యమంతా చాలా కళాత్మకంగా, భావయుక్తంగా, సంగీతంతో కలిపి అలంకరింపబడి ఉంటుంది. సంపూర్ణ రామాయణం ప్రారంభంలోనే వైకుంఠాన్ని చేరుకోవడానికి సప్తలోకాలకి ప్రతీకలుగా సప్త ద్వారాలను చూపుతూ, "రఘువంశ సుధాంబుధి చంద్రమ'' అనే త్యాగరాజ కీర్తనని సుప్రసిద్ధ వైణికుడైన చిట్టిబాబు గారి వీణానాదం ద్వారా వినిపిస్తారు. విష్ణుతత్వాన్ని వివరించే "శాంతాకారం భుజగశయనం పద్మనాభం'' శ్లోకం విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేసరికి పూర్తి అవుతుంది. ఆ విధంగా తొలి సన్నివేశానికే, ప్రేక్షకుడికి వైకుంఠ స్పర్శ కలుగుతుంది. 24 వేల శ్లోకాల రామాయణ మహాత్యం అంతా బాపుగారు చిత్రకళా రూపంలో ముందే ఆవిష్కరింపజేసి సిద్ధం చేసుకున్నారు. దీన్ని టైటిల్స్లోనే మనకు చూపుతారు.
రెండు రామాయణ సినిమాలూ రావణ దౌష్ట్యాల గురించి దేవతలు శ్రీ మహావిష్ణువుకి విన్నవించడంతోనే ప్రారంభమైనా, రెండిటి చిత్రీకరణలో బాపు విలక్షణత చూపారు. రవికాంత్ నగాయిచ్ ఫోటోగ్రఫీలో పురుష సూక్తంతో విశ్వమంతా వ్యాపించిన నారాయణతత్వాన్ని సూచిస్తూ చిత్రీకరించారు. వెలుగు ప్రక్కనే చీకటి ఉన్నట్లు తక్షణమే రావణ దౌష్ట్యాన్ని చూపి శ్రీరామ అవతార ఆవశ్యకత సూచిస్తారు. రావణాసురుడు ఎంత అసురుడైనా, అతడొక రావణబ్రహ్మ అనే విషయాన్ని శ్రీ మహావిష్ణువే స్వయంగా వివరిస్తారు. స్త్రీ కన్నీటి బిందువులే శ్రీరామ అవతారాన్ని ప్రభవింపజేశాయని చిత్రీకరిస్తారు. ఇందులో ప్రధానాంశమేమిటంటే సంభాషణలలో కన్నా సంగీతంలో చిత్రీకరణలో ఎక్కువ భావాలు కనిపిస్తాయి. ముఖ్యంగా సీతాకళ్యాణం చూసేటప్పుడు మనమో విషయం గుర్తు పెట్టుకోవాలి. బాపు రమణలు దేన్నయినా చిత్రీకరించేటప్పుడు దానిని నాలుగు భాగాలుగా విభజిస్తారు. ప్రతి అంశం వాచ్యంగా వినబడదు. కొంత సంభాషణల రూపంగా, కొంత నటుల హావభావాల్లోను, కొంత నేపథ్యంలోను, కొంత సంగీతంలోను కలిపి ఏక కాలంలో బాపు రమణలు అందిస్తారు. ప్రేక్షకులు సంభాషణల్లోని సాహిత్యాన్నే తలచుకుంటూ ఉండిపోయినా, సంగీతాన్నే ఆస్వాదిస్తూ ఉండిపోయినా, నటుల నటననే చూస్తూ ఉండిపోయినా, నేపథ్యం చిత్రీకరణ సొగసులకు కట్టుబడిపోయినా మిగిలినవన్నీ పూర్తిగా దర్శించలేకపోయే అవకాశముంది. అన్నిట్నీ అందుకోగలిగిన వారిదే పూర్తి రసానందం.
వాల్మీకి రామాయణం పదహారు సంపూర్ణ కళలతో కూడిన పదహారు గుణాలతో శ్రీరాముడిని శ్రీరామచంద్రుడిగా అభివర్ణించింది.
రామయణానికి సాంఘిక రూపకల్పన ముత్యాలముగ్గు. భారతీయుల జీవిత ధర్మంలో అణువణువునా రామాయణమే నిండి ఉన్నది. భారతీయ స్త్రీ స్వభావాన్ని, సౌశీల్యాన్ని త్రేతాయుగంలో ఎంత గొప్పగా కీర్తించారో కలియుగంలోను అంత విశేషంగానూ చెప్పుకుంటున్నారు. ఇల్లు అంటే ఇల్లాలే అనేదే భారతీయ సంస్కృతి. యుగాలు మారినా స్త్రీ ఆత్మవిశ్వాసంలోను, ఆత్మాభిమానంలోను స్త్రీ ఔన్నత్యం సార్వకాలికంగా ఎలా నిలిచి ఉన్నదో 'ముత్యమంత పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత చాయ'గా ఈ సినిమాలో ప్రకాశించింది. తమలపాకు, వక్క, సున్నం మూడు కలిసి తాంబూలమైన రీతిని భారతీయ వైవాహిక వ్యవస్థగా ఈ సినిమాలో బాపు రమణలు చూపారు.



ఆపద్ధర్మంగా తెచ్చుకున్న అద్దెమొగుడుతో అగ్నిహోత్రం ముందు నిలబడుతుంది భామ. అగ్నిదేవుడు భగ్గుమంటాడు. ఆ పాపాన్ని, ఈ భారాన్ని భరించలేని భామ ఆర్తనాదంచేసి కుప్పకూలిపోతుంది. సొమ్మసిల్లుతున్న భార్యను చేతుల్లోకి తీసుకుంటాడు కృష్ణమూర్తి. గట్టిగా గుండెలకు హత్తుకొని ఓదారుస్తాడు. ‘‘నిజాన్ని నీకు నువ్వుగా తెలుసుకోవాలని నిన్ను బాధపెట్టాను. ఈ బాధ మంచిది. అగ్నిగుండం ముందు నీ అనుమానం ఆవిరైపోయింది. నీ కన్నీరు నీ గుండెను కడిగి శుభ్రం చేసింది. ఇక కీడు క్రీనీడ కూడా మనమీద పడదు. ఇక నుంచి మన పెళ్లిపుస్తకంలో అన్నీ మంచి పేజీలే’’ అని భామ కన్నీళ్లను తుడుస్తాడు కృష్ణమూర్తి.
మేడమీద మేడగట్టి కోట్లు
తొలికోడి కూసేను తెలవార వచ్చేను
ముళ్ళపూడి వెంకటరమణ 1931 జూన్ 28న ధవళేశ్వరంలో జన్మించారు. ఈయన అసలు పేరు ముళ్ళపూడి వెంకటరావు. తండ్రి సింహాచలం. గోదావరి ఆనకట్ట ఆఫీసులో పని చేసేవారు. వారి పూర్వీకులు బరంపురంకు చెందిన వారు. రమణ కుటుంబం గోదావరి ఒడ్డున ఒక మేడలో ఉండేవారు. రమణ చిన్నతనంలోనే తండ్రి మరణించారు. దీనితో కుటుంబం ఇబ్బందులలో పడిం ది. సాహసం చేసి అతని తల్లి కుటుంబంతో మద్రాసు వెళ్ళింది. మద్రాసులో అక్కా బావల వద్ద చదువు మొదలుపెట్టిన రమణ 5, 6 తరగతులు మద్రాసు పి.ఎస్.స్కూలులో చదివారు. 7,8 తరగతులు రాజమండ్రి వీరేశలింగం హైస్కూలులోను, ఎస్సెల్సీ ఆనర్స్ దాకా కేసరి స్కూలులోను చదివారు. పాఠశాల విద్యార్ధిగానే లెక్కలలోను, డిబేట్లు, వ్యాస రచనలోను ప్రతిభ చూపించారు. హాబీగా పద్యాలు అల్లేవారు. నాటకాలలో వేషాలు వేసేవారు కూడా.
ముళ్ళపూడి వెంకటరమణ వ్రాసిన ఒక హాస్య రచన. ముళ్ళపూడి వ్రాతలు... బాపు బొమ్మల ద్వారా హా స్యపూర్వకంగా బుడుగు అనే పిల్లవాని భాష, అల్లరి, ఆలోచనలు, ప్రవర్తన ఈ పుస్త్తకంలో వివరించారు రమణగారు. తెలుగు సాహిత్యంలో ఈ తరహా పుస్త్తకాలలో ప్రసిద్ధమైంది ఇదొక్కటే అనవచ్చును.ముళ్ళపూడి రచనలు ముళ్ళపూడి సాహితీ సర్వస్వం అనే సంపుటాలుగా లభి స్తున్నాయి. అనువాద రమణీయం, సినీరమణీయం, బాలరమణీయం, కదం బ రమణీయం ఇలా. ఇందులో 3వ సంపుటం బాలరమణీయం బుడుగు. ఇది ఎమ్బీఎస్ ప్రసాద్ సంపాదకత్వం (ముందుమాట)తో వెలువడింది. ఈ రచన ప్రశంస ఆరుద్ర కూనలమ్మ పదాలులో ఇలా ఉంది. ‘హాస్యమందున అఋణ...అందె వేసిన కరుణ...బుడుగు వెంకటరమణ...ఓ కూనలమ్మా!
‘ నా అంతవాడు నేను. నన్ను ఎవరూ కొట్టకూడదు. నేను నిఝంగా పెద్ద వాడినే అనుకో. ఐతే వాళ్ళే నన్ను కురక్రుంకా అంటారుగా. అందుకని కొట్ట కూడదు. సిగరెట్లు తెల్లగా ఉంటాయిలే. వీటిని బాబాయిలాంటి కురవ్రాళ్ళు కాలుస్తారు. .. మరి నేను పెద్దవాడినిగా. అందుకనే కాలవను. నేను ఇంఖా పెద్దవాణ్ణయ్యాకా జెటకా బండియేనా రెైలింజనేనా తోలుతానుగా. అందుకని బీడీలు దాస్తాననుకో. అప్పుడు చెవులో పెట్టుకోవాలిగా. బీడీలు బామ్మ వత్తు ల పెట్టెలో దాస్తే భద్రంగా ఉంటాయి... అగరొత్తులు నల్లగా ఉంటాయి. వాటిని గోడమీద గుచ్చి కాలుస్తారు. సిగరెట్లేమో నోట్లో గుచ్చి కాలుస్తారు.
బాపు కుడిభుజం, ‘బుడుగు’ సృష్టికర్త, ప్రఖ్యాత రచయిత ముళ్లపూడి వెంకటరమణ చెన్నయిలో నిన్న ఉదయం మరణించారు. ఆయన వయసు 80 సంరాలు. ఈయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఈయన జూన్ 28, 1931లో జన్మించారు. ‘ఆంధ్రపత్రిక’ సబ్ ఎడిటర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించడానికి ముందే ‘ఉదయభాను’ పేరుతో ఒక పత్రికను ఈయన స్వయంగా నిర్వహించడం విశేషం. ‘దాగుడుమూతలు’, ‘రక్తసంబంధం’, ‘భార్యాభర్తలు’, ‘మూగమనసులు’ వంటి చిత్రాలకు సంభాషణలు అందించిన ముళ్లపూడి.. బాపు దర్శకత్వంలో రూపొందిన అన్ని చిత్రాలకూ రచన చేసారు. ముళ్లపూడి రచనలకు బాపు బొమ్మలు గీస్తే.. బాపు చిత్రాలకు మాటలు నేర్పే బాధ్యత ముళ్లపూడిదే.
తెలుగుజాతి గత ఏడాది 'పాట'ను కోల్పోయింది. నేడు 'మాట'ను కోల్పోయింది. నెలరోజుల క్రితం సంపాదక ప్రముఖుడ్ని (చందూర్) కోల్పోయింది. సాహిత్యంలో, మరీ ముఖ్యంగా చలనచిత్రసీమలో సునిశిత హాస్యాన్ని అసమానంగా పండించిన మితభాషి ముళ్లపూడి వెంకటరమణ సాహితీ ప్రియులకు అమిత బాధను మిగిల్చి వెళ్లిపోయారు.'రాత-గీత' ద్వయంలో (బాపు-రమణ)'రాత' నిష్క్రమించింది. బుడతజంట 'బుడుగు-సిీగాన పెసూనాంబ', యువజంట 'రాధా-గోపాళం' 'పక్కింటి లావుపాటి పిన్నిగారు, 'ఆవిడ మొగుడు', రెండుజెళ్లసీత, కలాపోసనగల మర్డర్ల కాంట్రాక్టర్, ఆయన సెగట్రీ, అద్దె భజంత్రీలు, నిత్యపెళ్లికొడుకు, అప్పుల అప్పారావు, 'తీతా', దొరవారి సహాయకుడు'కన్నప్ప'ఇలా ఒకరేమిటి...ఎన్నెన్నో పాత్రలతో పాటు తెలుగుపాఠక, ప్రేక్షకజనం.. మరీ ముఖ్యంగా హాస్యప్రియులు కలతచెందారు.































